Faculty Posts: ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు అధ్యాపకుల నియామకం
Sakshi Education
![Faculty Posts for Food Technology,](/sites/default/files/images/2023/10/14/food-technology-faculty-jobs-1697277278.jpg)
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో కొత్తగా ప్రారంభించిన ఎమ్మెస్సీ ఫుడ్ టెక్నాలజీ కోర్సుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమిస్తున్నామని ఉప కులపతి ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. ఈ కోర్సుకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన వస్తున్నందున హెచ్ఓడీగా డాక్టర్ డి.కల్యాణిని నియమించారు. ప్రస్తుతం ఆమె జూవాలజీ విభాగంలో సహాధ్యపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో 42 సంవత్సరాల అనుభవం గడించిన విశ్రాంత ఆచార్యుడు పి.రామకృష్ణను అధ్యాపకునిగా నియమించారు. వీరిద్దరికీ వీసీ ఆచార్య పద్మరాజు శుక్రవారం నియామక ఉత్తర్వులు అందజేశారు.
చదవండి: SI Main Exam: నేడు, రేపు ఎస్ఐ పోస్టులకు మెయిన్ పరీక్షలు
Published date : 14 Oct 2023 03:24PM