Skip to main content

Mega Job Mela: కొలువుల మేళా.. 120 కంపెనీలు... 1880 ఉద్యోగాలు

mega job mela in andhra pradesh

రాయచోటి: రాయచోటిలోని సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. ఇందులో 120 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 6 వేల మంది ఉద్యోగ, ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మెగా జాబ్‌మేళాను జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీషాతో కలిసి ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉద్యోగాలకు ఎంపికై న 1880 మందికి వారు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కొలువు దక్కిన వారు సంతోషం వ్యక్తం చేశారు. జాబ్‌మేళాకు అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల నుంచి నిరుద్యోగ యువత వచ్చారు. వారికి భోజన సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్బాల్‌ అహ్మద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాథరెడ్డి, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఆవుల విష్ణువర్ధన్‌రెడ్డి, ఎం.చిదంబర్‌రెడ్డి, జెడ్పీటీసీలు వెంకటేశ్వరరెడ్డి, మాసన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

చ‌ద‌వండి: Mega Job Mela: 1256 మందికి ఉద్యోగాలు

Published date : 04 Dec 2023 03:22PM

Photo Stories