Skip to main content

ISRO: ఇస్రోలో అప్రెంటిస్‌కు ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి

ISRO
ISRO

సాలూరు: పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చదివిన విద్యార్థి ఇస్రోలో అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపాల్‌ రవికుమార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మండలంలోని చీపురువలస గ్రామానికి చెందిన ఎస్‌.యుగంధర్‌ 2019–21 విద్యాసంవత్సరంలో కళాశాలలో రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ట్రేడ్‌ చదివాడన్నారు. తమ విద్యార్థి అప్రెంటిస్‌కు ఎంపికై నట్లు ఇస్రో నుంచి లేఖ అందిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి యుగంధర్‌ను ప్రిన్సిపాల్‌ రవికుమార్‌ ,సిబ్బంది రంభ శ్రీషణ్ముఖ్‌ తదితరులు బుధవారం అభినందించారు. జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Published date : 31 Aug 2023 08:28PM

Photo Stories