Skip to main content

Best Teacher Award: ద్రోణాదుల ఉపాధ్యాయుడికి బెస్ట్‌ టీచర్‌ అవార్డు

Best Teacher Award for Teacher

మార్టూరు: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ద్రోణాదుల ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు షేక్‌ జానీబాషా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చేతుల మీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సీఎం జగన్‌ సమక్షంలో జరిగిన వేడుకల్లో భాగంగా జానీబాషా పురస్కారం అందుకున్నారు. జానీ బాషాను ఎంఈవో వస్రాం నాయక్‌ ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

చదవండి: Lecturer Jobs: లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
గుంటూరు ఎడ్యుకేషన్‌: 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈనెల 14 నుంచి అరండల్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి కె.ఝాన్సీలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 శాఖా గ్రంథాలయాల్లో సైతం వారోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. వారం రోజులపాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు పుస్తక ప్రదర్శన, మహిళా దినోత్సవం, మెహందీ పోటీలు, కవి సమ్మేళనం, చర్చాగోష్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. విద్యార్థులకు చిత్రలేఖన, వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్‌, మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల నిర్వహణ ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, యువత, విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
 

Published date : 13 Nov 2023 01:31PM

Photo Stories