విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరం..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: అత్తాపూర్ భాష్యం స్కూల్ ఆధ్యర్యంలో నవంబర్ 26వ తేదీన ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
![](/sites/default/files/images/2022/11/26/bhasyam-1669469246.jpeg)
ఈ కార్యక్రమంలో విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా భాష్యం స్కూల్స్ సీఈఓ చైతన్య మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు పలు రంగాల్లో నైపుణ్యాలు ఉండాలన్నారు. అలాగే నేటి సమాజం విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య చాలా అవసరమన్నారు.
![Students Education](/sites/default/files/inline-images/Princiapla321.jpeg)
బాల్యం విశిష్టతను, విద్యార్థి జీవితంలో సక్సెస్ అవ్వలంటే ఉండాల్సిన లక్షణాల గురించి ప్రిన్సిపాల్ అయూబ్ బాషా విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జేఈఓ అంకమ్మరావు పాల్గొన్నారు.
Published date : 26 Nov 2022 06:57PM