Skip to main content

CM YS Jagan Mohan Reddy: విద్యారంగానికి సీఎం జగన్‌ పెద్దపీట

Jagan call for quality education in schools

పూతలపట్టు: వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగానికి పెద్దపీట వేశారని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులంతా కష్టపడి పనిచేసి భావిభారత పౌరులను తీర్చిదిద్దాలన్నారు. అనంతరం ఎంఈఓ కృష్ణారెడ్డి మండలంలోని 125 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గిరిప్రసాద్‌, ఎంపీడీఓ గౌరి, ఎంఈఓ–2 కోటీశ్వరయ్య, హెచ్‌ఎంలు చంద్రశేఖర్‌, సర్పంచ్‌ సంఘ అధ్యక్షుడు జయచంద్రారెడ్డి, రాజారత్నంరెడ్డి, జెడ్పీటీసీ దేవిక, కో–ఆప్షన్‌ మెంబర్‌ ఖాదర్‌వళి, సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.

చ‌ద‌వండి: ఉపాధ్యాయుల శ్రమ వెలకట్టలేనిది: ఎమ్మెల్యే

Published date : 06 Sep 2023 06:11PM

Photo Stories