Alumni's Contribution : పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల చేయూత..
![Contribution from alumni for their school development](/sites/default/files/images/2024/07/29/alumni-contribution-school-development-1722254257.jpg)
కాశీబుగ్గ : మందసలోని శ్రీరాజాశ్రీనివాస స్మారక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం పునరుద్ధరణకు పూర్వ విద్యార్థులు ముందుకు వస్తున్నారు. 2001 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులు లక్ష రూపాయలు సేకరించి మందస హైస్కూల్ ఓల్డ్ బిల్డింగ్ రెనోవేషన్ ఫోరం వాట్సాప్ అడ్మిన్ ప్రొఫెసర్ పట్నాల మోహనరావు ఆచారికి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరింత మంది దాతలు ముందుకొచ్చి పాఠశాల అభివృద్ధికి సాయం అందించాలని కోరారు.
United Nations: ఐక్యరాజ్యసమితిలో రామకథా పారాయణం
కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సిందిరి జగన్నాథరావు, కుప్పాయి గోపాలరావు, రవికుమార్ మహంతి, దక్కత సంతోష్, మామిడి చిరంజీవి, శంకర మహరణ, ఎస్.సూర్యారావు, నిమ్మన సురేష్, టి.హేమసుందర్, బత్తుల మురళీ, బమ్మిడి శాంతిలత, కనగల భారతి, కృష్ణకుమారి, జ్యోతి, హెచ్ఎం రవికుమార్, శిష్టు సోమనాథ్, ప్రభాకర్ పట్నాయక్, రవీంద్ర, దువ్వు జగదీష్, ఎంపీటీసీ కంచిబెహరా పాల్గొన్నారు.