Skip to main content

UPSC Civils 2022 Rankers Success Story : యూపీఎస్సీ సివిల్స్‌లో మా స‌క్సెస్ మంత్రం ఇదే..

ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్‌–2022 పరీక్షల తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. జాతీయస్థాయిలో టాప్‌ ర్యాంకులను సాధించి రికార్డు సృష్టించారు. సివిల్స్‌–2022 తుది ఫలితాలను యూపీఎస్సీ మే 23వ తేదీన (మంగళవారం) విడుదల చేసిన విష‌యం తెల్సిందే. సివిల్స్ జాతీయ స్థాయి పరీక్షల్లో తిరుపతికి చెందిన పవన్ దత్త 22వ ర్యాంక్ సాధించాడు. అలాగే ఈయ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టాప్‌-1 ర్యాంక్ సాధించాడు. అలాగే తెలంగాణ‌కు చెందిన‌ Sai Ashrith 40వ ర్యాంక్ సాధించాడు. తెలంగాణ‌కు చెందిన మధ్యాహ్న భోజన కార్మికురాలి కుమారుడు డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410 ర్యాంకుతో మెరిశాడు. మ‌రో విద్యార్థి Thummala Sai Krishna Reddy 640వ ర్యాంక్ సాధించాడు. ఈ నేప‌థ్యంలో వీరి స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం..

Photo Stories