Skip to main content

UGC NET 2022: యూజీసీ నెట్-2022(జూన్‌) నోటిఫికేషన్ విడుదల.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ).. నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌.. సంక్షిప్తంగా యూజీసీ నెట్‌! ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష. పరిశోధనలు, అకడమిక్‌ కెరీర్, ఆర్థిక ప్రోత్సాహం పొందేందుకు చక్కటి మార్గం.. యూజీసీ నెట్‌!
UGC NET 2022
UGC NET 2022 Notification

ఇందులో ప్రతిభ చూపి.. మెరిట్‌ జాబితాలో నిలిస్తే.. ప్రముఖ యూనివర్సిటీలు, ప్రఖ్యాత రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో పరిశోధనలు చేసే అవకాశం లభిస్తుంది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(జేఆర్‌ఎఫ్‌) ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాలు సొంతం చేసుకోవచ్చు! తాజాగా.. యూజీసీ–నెట్‌ 2022(జూన్‌)కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. 

అభ్యర్థులు మే 20 వరకు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. మొత్తంగా 82 సబ్జెక్టులకు ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) పద్ధతిలో ఈ ఎగ్జామ్‌ ఉంటుంది. అయితే అడ్మిట్ కార్డుల విడుదల, ఎగ్జామ్ తేదీలకు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. ఇందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (NTA) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం.. http://http ://ugcnet.nta.ac.in వెట్‌సైట్‌ను సంప్రదించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.

82 సబ్జెక్ట్‌లలో పరీక్ష :
యూజీసీ నెట్‌ మొత్తం 82 సబ్జెక్ట్‌ విభాగాల్లో జరగనుంది. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డ్యూటీస్, ఇండియన్‌ కల్చర్‌ తదితర ఆర్ట్స్‌ అండ్‌ హ్యుమానిటీస్, లింగ్విస్టిక్‌ సబ్జెక్ట్‌లతోపాటు కంప్యూటర్‌ సైన్స్, క్రిమినాలజీ, మేనేజ్‌మెంట్‌ వంటి ప్రొఫెషనల్‌ సబ్జెక్ట్‌లు కూడా ఉన్నాయి. పీజీ స్థాయిలో చదివిన స్పెషలైజేషన్‌కు అనుగుణంగా ఆయా పేపర్లకు హాజరయ్యే అర్హత లభిస్తుంది. 

అర్హతలు ఇవే..
➤ సంబంధిత పీజీ(పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు అయిదు శాతం సడలింపు లభిస్తుంది.
➤ పీజీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

వయో పరిమితి: 
➤ ఓబీసీ–ఎన్‌సీఎల్, ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
➤అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులకు ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. 

రెండు కేటగిరీల్లో యూజీసీ నెట్ :
యూజీసీ–నెట్‌ను రెండు కేటగిరీలుగా వర్గీకరించారు. అవి.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. దరఖాస్తు సమయంలోనే అభ్యర్థులు తాము ఏ కేటగిరీ పరీక్షకు హాజరవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలి. ఉదాహరణకు.. పరిశోధన అభ్యర్థులు.. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీ మాత్రమే కోరుకుంటే.. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. ఇలా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాథమ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రశ్నలు అడుగుతారు.

కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్ (CBT) పద్ధతిలో.. : 
☛ యూజీసీ–నెట్‌ పరీక్ష ఆన్‌లైన్‌ విధానం (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లో ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు.
☛ మొత్తం మూడు వందల మార్కులకు జరిగే ఈ పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్‌1, పేపర్‌ 2 ఉంటాయి. 
☛ పేపర్‌–1కు అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ అండ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అభ్యర్థులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. 
☛ పేపర్‌–1లో టీచింగ్‌/రీసెర్చ్‌ అప్టిట్యూడ్‌పై 50 ప్రశ్నలు–100 మార్కులు ఉంటాయి. అంటే.. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. 
☛ పేపర్‌–2.. అభ్యర్థులు తమ పీజీ స్పెషలైజేషన్‌ ఆధారంగా ఎంచుకున్న సబ్జెక్టుకు సంబంధించిన పరీక్ష. 
☛ పేపర్‌–2లో సంబంధిత సబ్జెక్ట్‌ పేపర్‌ నుంచి 100 ప్రశ్నలు–200 మార్కులకు ఉంటాయి. 
☛ పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు.

కనీస అర్హత మార్కులు ఇలా..
★ యూజీసీ నెట్‌లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి 40 శాతం మార్కులు, రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 35శాతం మార్కులు సాధించాలి. 
★ కేవలం ఆరు శాతం మందిని మాత్రమే తుది జాబితాకు ఎంపిక చేసే నెట్‌ జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేటగిరీల్లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులకు పరిశోధనలపై ఆసక్తితోపాటు సంబంధిత సబ్జెక్ట్‌పై గట్టి పట్టుండాలి. 

పేపర్‌1:
పేపర్‌–1లో అభ్యర్థుల్లోని టీచింగ్, రీసెర్చ్‌ ఆసక్తులను, అవగాహనను పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పది విభాగాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రధానంగా టీచింగ్, రీసెర్చ్‌ అప్టిట్యూడ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, కమ్యూనికేషన్, రీజనింగ్, లాజికల్‌ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, పీపుల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌–గవర్నెన్స్, పాలిటీ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

పేపర్‌ 2:
పేపర్‌–2లో ప్రశ్నలు పీజీ స్పెషలైజేషన్‌ సిలబస్‌ స్థాయిలో ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌కు సంబంధించి ఇంటర్మీడియెట్‌ నుంచి పీజీ వరకూ.. అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఆయా అంశాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్, ప్రాక్టికల్‌ అప్రోచ్‌తో చదవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉన్నప్పటికీ.. ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్‌ థింకింగ్, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌ను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతున్నారు. అదేవిధంగా క్రిటికల్‌ థింకింగ్, అనలిటికల్‌ అప్రోచ్‌ అలవరచుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ప్రశ్నలు ఏవిధంగా అడిగినా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.

Published date : 02 May 2022 12:34PM

Photo Stories