Skip to main content

TSPSC Group 2: పరీక్షలు రీషెడ్యూల్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గ్రూప్‌–2 పరీక్షలను రీషెడ్యూల్‌ చేస్తున్నట్టు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆగస్టు 13న ప్రకటించింది.
TSPSC Group 2
పరీక్షలు రీషెడ్యూల్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన తేదీలు ఇవే..

2023 నవంబర్‌ 2, 3 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. నవంబర్‌ 2న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌–2 పరీక్ష ఉంటాయని వెల్లడించింది. నవంబర్‌ 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌–3, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌–4 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | క్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం రోజుల ముందు నుంచీ కమిషన్‌ వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వివరించింది. వాస్తవానికి గ్రూప్‌–2 పరీక్షలు ఆగస్టు 29, 30వ తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ ఇతర పోటీ పరీక్షలు ఉండటంతోపాటు వీటికి సన్నద్ధం కావడానికి మరింత సమయం అవసరమని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని పరీక్షలను కొంతకాలం వాయిదా వేయాలని కమిషన్‌కు సూచించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్‌ చేసింది.  

Published date : 14 Aug 2023 12:44PM

Photo Stories