SI Post Achievers: ఎస్ఐగా కొలువు సాధించిన ఇద్దరు యువకులు
![SI achievers](/sites/default/files/images/2023/10/20/si-achievers-1697801379.jpg)
రైతు కుటుంబంలో పుట్టిన ఇద్దరు యువకులు ఎస్సై కొలువు సాధించారు. ధర్మపురి మండలం నాగారంకు చెందిన మేడిశెట్టి పెద్ద తిరుపతి–అమ్మాయి దంపతుల మూడో కుమారుడు కమలాకర్. అతనికి పోలీస్ ఉద్యోగంలో కొలువు సాధించాలనే ఆశతో పరీక్షలకు సిద్ధపడ్డాడు.
![SI](/sites/default/files/inline-images/kamalakar.jpg)
SI Success Story: ఎస్ఐగా ఎంపికైన యువతీ
అలా తన కృషి, తన తల్లిదండ్రుల సహకారంతో తనకు కొలువుకు చేరువైయ్యాడు. ఇటీవల వెలువడిన ఎస్సై ఫలితాల్లో ఏఆర్ ఎస్సైగా సెలెక్ట్ అయ్యాడు. అదేవిధంగా మేడిశెట్టి తిరుపతి–గంగజమున కుమారుడు రమేశ్ కూడా ఎస్సైగా గెలుపు పొందాలనే పరీక్షలు పూర్తి చేసి ఫలితాలనుసారం ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యాడు.
![SI](/sites/default/files/inline-images/ramesh.jpg)
Dream Successful: చిన్నప్పటి కలను సాకారం చేసుకున్న యువకుడు
ఒకే గ్రామానికి చెందిన వరుసకు అన్నదమ్ములైన కమలాకర్, రమేశ్లు ఎస్సై పోస్టులకు ఎంపిక కావడంపై ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వీరిరువురి తల్లిదండ్రులు వ్యవసాయదారులే. యువకులు తమ తల్లిదండ్రులను గర్వపడే స్థాయికి ఎదగడంతో వారూ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు.