Intermediate: ఇంటర్ మూల్యాంకనం తెదీలు విడుదల
Sakshi Education
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభం కానుంది.
సంస్కృతం పేపర్–1, పేపర్–2 ఇదే రోజు చేపడతారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్ల మూల్యాంకనం మే 22న, ఫిజిక్స్ ఎకనామిక్స్ 26న, కెమిస్ట్రీ, కామర్స్ 28న, హిస్టరీ, బాటనీ, జువాలజీ పేపర్ల మూల్యంకనం 31న మొదలవుతుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మూల్యాంకన కేంద్రాలను ఎంపిక చేస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు మే 8న ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ (2), నిజామాబాద్, మహబూబ్నగర్, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, వరంగల్, సిద్దిపేట కేంద్రాలను ఎంపిక చేశారు. జూన్ మొదటి వారంలో మూల్యంకన ప్రక్రియ పూర్తి చేసి, రెండో వారంలో ఫలితాలు వెల్లడించే వీలుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఫలితాలు వెల్లడించిన 15 రోజుల్లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ నిర్వహించాలని భావిస్తున్నారు.
Published date : 09 May 2022 12:50PM