TET: మళ్లీ టెట్ నిర్వహించండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: Teachers Eligibility Test (TET) (టెట్) పరీక్షను మళ్లీ నిర్వహించి తమకూ గురుకుల, డీఎస్సీ, టీఆర్టీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని టెట్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తాము బీఈడీ, డీఈడీ రెండో సంవత్సరం కోర్సు పూర్తి చేశామని, గతంలో నిర్వహించిన టెట్కు హాజరుకాలేకపోవడంతో పాటు దాదాపు నాలుగు లక్షలమంది దాకా అర్హత సాధించలేక పోయామని పేర్కొన్నారు.
చదవండి: టెట్ - సిలబస్ | డీఎస్సీ | బిట్ బ్యాంక్ | ప్రిపరేషన్ గైడెన్స్ | మోడల్ పేపర్స్ | 2022 ప్రివియస్ పేపర్స్
గురుకుల, డీఎస్సీ నిర్వహించే ముందు మరోసారి టెట్ నిర్వహిస్తే తమకు న్యాయం జరుగుతుందని కోరారు. ఈ మేరకు ఫిబ్రవరి 2న ఇతర ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావులకు వినతిపత్రాలు సమరి్పంచారు.
Published date : 03 Feb 2023 01:59PM