సాక్షి, హైదరాబాద్: Teachers Eligibility Test (TET) (టెట్) పరీక్షను మళ్లీ నిర్వహించి తమకూ గురుకుల, డీఎస్సీ, టీఆర్టీ పరీక్ష రాసే అవకాశం కల్పించాలని టెట్ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మళ్లీ టెట్ నిర్వహించండి
తాము బీఈడీ, డీఈడీ రెండో సంవత్సరం కోర్సు పూర్తి చేశామని, గతంలో నిర్వహించిన టెట్కు హాజరుకాలేకపోవడంతో పాటు దాదాపు నాలుగు లక్షలమంది దాకా అర్హత సాధించలేక పోయామని పేర్కొన్నారు.
గురుకుల, డీఎస్సీ నిర్వహించే ముందు మరోసారి టెట్ నిర్వహిస్తే తమకు న్యాయం జరుగుతుందని కోరారు. ఈ మేరకు ఫిబ్రవరి 2న ఇతర ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావులకు వినతిపత్రాలు సమరి్పంచారు.