Skip to main content

National Award: మాల్‌కు ‘జాతీయ ఉత్తమ పంచాయతీ’ అవార్డు

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి వైవీ రాజుకు ఏప్రిల్ 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 'జాతీయ ఉత్తమ పంచాయతీ' అవార్డు లభించింది.
Telangana’s Mall Panchayat Bags National Award for Self Sufficiency

మాల్ గ్రామ పంచాయతీ ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను సమకూర్చుకుంటున్నందుకు గాను 'ఆత్మనిర్భర్ పంచాయతీ' విభాగంలో ఈ అవార్డుకు ఎంపికైంది. 

ఈ పురస్కార ప్రదానోత్సవం బిహార్‌లోని మధుబనిలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారులు సురేశ్‌మోహన్, జిల్లా పరిషత్తు సీఈవో కృష్ణారెడ్డి, యాచారం ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీలత కూడా పాల్గొన్నారు.

National Award: జాతీయ అవార్డును అందుకున్న గొల్లపూడి పంచాయతీ కార్యదర్శి

ఈ అవార్డుల జాబితాలో మాల్ గ్రామ పంచాయతీ దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా, ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన హత్బద్ర గ్రామ పంచాయతీ రెండవ స్థానాన్ని, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన గొల్లపూడి గ్రామ పంచాయతీ మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి. 

విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ట్రోఫీలు, సర్టిఫికెట్లతో పాటు, మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో నిలిచిన పంచాయతీలకు వరుసగా రూ.1 కోటి, రూ.75 లక్షలు, రూ.50 లక్షల ఆర్థిక ప్రోత్సాహకం కూడా లభిస్తుంది. 

☛ Follow our YouTube Channel  (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 25 Apr 2025 01:30PM

Photo Stories