Skip to main content

High Court: నీట్‌ పీజీలో ఎస్సీ, ఓబీసీ కటాఫ్‌ మార్కులు ఎన్ని?

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌ పీజీ–2023 అడ్మిషన్లలో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన.. చివరిగా అడ్మిట్‌ అయిన అభ్యర్థి సాధించిన మార్కులు, ర్యాంక్‌ వివరాలు తెలియజేయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ)ను హైకోర్టును ఆదేశించింది.
High Court
నీట్‌ పీజీలో ఎస్సీ, ఓబీసీ కటాఫ్‌ మార్కులు ఎన్ని?

తదుపరి విచారణ నేటికి  వాయిదా వేసింది. ట్రాన్స్‌ జెండర్లకు రిజర్వేషన్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో సూచించినా.. జాతీయ మెడికల్‌ కమిషన్‌ జారీ చేసిన నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌లో ఎక్కడా ఆ ఆంశాన్ని పేర్కొనలేదని హైదరాబాద్‌కు చెందిన కొయ్యల రూత్‌ జాన్‌ పాల్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

చదవండి: NMC: నీట్‌ మెడికల్‌ పీజీ స్టేట్‌ ర్యాంక్‌లు విడుదల

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం జూన్‌ 19న  విచారణ చేపట్టింది. నీట్‌ పీజీ అడ్మిషన్లలో అర్హత సాధించిన చివరి అభ్యర్థి ర్యాంకులు, మార్కులను తెలుసుకుని రావాలని ఎన్‌ఎంసీ న్యాయవాదిని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.  

చదవండి: NMC: గ్రామాలకు ఎంబీబీఎస్‌ విద్యార్థులు!.. ప్రతి వైద్య విద్యార్థికి ఇన్ని కుటుంబాల దత్తత..

Published date : 20 Jun 2023 02:36PM

Photo Stories