సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు గడువు నవంబర్ 4 సాయంత్రం ముగియనుంది.
అభ్యంతరాల స్వీకరణకు ఆఖరు తేదీ ఇదే..
రాష్ట్రంలోని మెడికల్, డెంటల్, ఆయూష్ కళాశాలల్లో 2022–23వ విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటా ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ అభ్యంతరాలను తగిన ధ్రువీకరణపత్రాలతో ysrugmed adm22@gmail.comకు పంపాలి.