ప్రిపైరయ్యేందుకు చాలినంత సమయం లేనందున వాయిదా వేయాలని ఇంటర్న్షిప్ గడువు ముగియనందున కౌన్సిలింగ్ ఆగస్ట్ 11వ తేదీ తర్వాత చేపట్టాలని పిటిషన్లు కోరారు. దీనిపై ఫిబ్రవరి 27న జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణ చేపట్టింది. పరీక్ష తేదీ మార్పుకు ఈ దశలో అవకాశం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి చెప్పారు.
‘‘తప్పో, ఒప్పో. పరిణామక్రమంలో ఇదంతా ఒక భాగం. ఇది కొన్నిసార్లు కరెక్టు, కొన్నిసార్లు తప్పు కావొచ్చు. మీరెలా అనుకుంటే అలా! పరీక్షను మరోసారి రాయాలనుకునే విద్యార్థిని ఈ ప్రపంచంలో ఏశక్తీ అడ్డుకోజాలదు’ అని పేర్కొంటూ పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.