NEET exams: నీట్ను రద్దు చేయాలని ధర్నా
Sakshi Education
![NEET exams should be cancelled](/sites/default/files/images/2023/08/21/neet-exam-1692606463.jpg)
హోసూరు: తమిళనాడు రాష్ట్రంలో నీట్ పరీక్షలు రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర గవర్నర్ వైఖరి సరిగా లేదని ఆదివారం జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో డీఎంకే పార్టీ భారీ ఎత్తున నిరాహార దీక్ష చేపట్టింది. క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా కార్యదర్శి, హోసూరు ఎమ్మెల్యే వై. ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం నీట్ పరీక్షలను అమలు చేయడంతో ప్రతిభావంతులైన విద్యార్థులు వైద్య విద్యలో ప్రవేశించలేకపోతున్నారని, వెంటనే నీట్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గవర్నర్ వ్యవహారం సరిగా లేదన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష కొనసాగింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది పాల్గొన్నారు.
Published date : 21 Aug 2023 01:57PM