Skip to main content

తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్‌కు రూ. 2,285 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్‌కు (ఎస్‌ఎస్‌ఏ) 2020–21 విద్యా సంవత్సరంలో రూ. 2,285 కోట్ల బడ్జెట్‌కు ఎస్‌ఎస్‌ఏ అప్రూవల్‌ బోర్డు ఆమోదం తెలిపింది.
ఇందులో గత విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన రూ. 781.38 కోట్లు కలుపుకొని ఈ మొత్తాన్ని కేటాయించింది. గతేడాది మిగిలిపోయిన ఆ మొత్తాన్ని ఈసారి సద్వినియోగపరచుకోవచ్చని పేర్కొంది. ఈసారి తాజాగా రాష్ట్ర ఎస్‌ఎస్‌ఏకు రూ.1,504.15 కోట్లు కేటాయించింది. అందులో రూ.170.24 కోట్లు నాన్‌ రికరింగ్‌గా, రూ.1,333.90 కోట్లు రికరింగ్‌ మొత్తంగా కేటాయించింది. ఇక మొత్తం బడ్జెట్‌లో రాష్ట్రం 40% వెచ్చించాల్సి ఉంటుంది. కేంద్రం 60% ఇవ్వనుంది.
Published date : 08 Aug 2020 02:09PM

Photo Stories