Skip to main content

‘అధిక ఫీజులు వసూలు చేస్తే గుర్తింపు రద్దు’

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీలోని 8 జిల్లాల్లో కాకినాడ జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే ఆ కళాశాలల గుర్తింపు రద్దు చేస్తామని రిజిస్ట్రార్ సీహెచ్ సత్యనారాయణ హెచ్చరించారు.
ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు తదితర పేర్లతో విద్యార్థులను వేధించవద్దని ఆదివారం ఒక ప్రకటనలో కళాశాలలను కోరారు. జగనన్న విద్యా దీవెన ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 4 విడతలుగా సొమ్ము జమ అవుతుందని, ఆ సొమ్మును కళాశాలలకు చెల్లించాలని సూచించారు.
Published date : 08 Feb 2021 02:29PM

Photo Stories