సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉస్మానియా యూనివర్సిటీ మే 25న పరీక్ష నిర్వహించింది.
TS Lawcet 2023 Results
ఈ లాసెట్ ఫలితాలను జూన్ 15వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.sakshieducation.comలో చూడొచ్చు.
ఎల్ఎల్బీ , ఎల్ఎల్ఎమ్ ప్రవేశాల కోసం మే 25న మూడు విడతల్లో లాసెట్, పీజీ ఎల్సెట్ పరీక్షలను నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ ప్రవేశ పరీక్షలకు 43,692 మంది దరఖాస్తు చేసుకోగా.. 36,218 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో మూడేళ్ల ఎల్ఎల్బీ(LLB) కోర్సుకు 25,747మంది ఉన్నారు.