Skip to main content

‘నిర్విక్’ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి?

వృద్ధి పెంపునకు ప్రభుత్వ చర్యలు:
  • భారత్ 1991 తర్వాత అవలంభించిన సరళీకరణ విధానాలు స్థూల దేశీయోత్పత్తి వృద్ధిలో పెరుగుదలకు కారణమయ్యాయి. భారత్ మార్కెట్ కాపిటలైజేషన్ 2018 డిసెంబర్‌లో నామినల్ జి.డి.పి.లో 76.4 శాతంగా నమోదైంది.
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి అభిప్రాయంలో నామినల్ జి.డి.పి. పరంగా ప్రపంచంలో భారత్ ఏడో స్థానం పొందింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత్ నామినల్ జి.డి.పి.ని 2.308 ట్రిలియన్ డాలర్లగా అంచనా వేసింది. నామినల్ జి.డి.పి. పెరుగుదలకు దేశీయంగాను, అంతర్జాతీయంగాను భారతీయ కంపెనీల వాణిజ్య వృద్ధిలో పెరుగుదల కారణమైంది. గత రెండు సంవత్సరాలుగా భారత జి.డి.పి. వృద్ధిలో తగ్గుదల నేపథ్యంలో భారత ప్రభుత్వం వృద్ధిని వేగవంతం చేయడానికి అనేక చర్యలు చేపట్టింది. కొంత కాలంగా పెట్టుబడి రేటు తగ్గుదల, వినియోగం తగ్గుదల, సేవా రంగ వృద్ధి క్షీణత, విదేశీ రంగంలో వృద్ధి క్షీణత, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల పరపతి వృద్ధి క్షీణతతో పాటు కార్పొరేట్, పర్యావరణ నియంత్రణ విధానాలు ఇటీవలి కాలంలో వృద్ధి తగ్గుదలకు కారణమయ్యాయి.
  • తయారీ రంగం, వాణిజ్యం, హోటళ్లు, రవాణా, సమాచారం, బ్రాడ్ కాస్టింగ్ లాంటి రంగాల వృద్ధిపై దృష్టి సారించాలని ఆర్.బి.ఐ. వార్షిక నివేదిక 2018-19 వెల్లడించింది. పెట్టుబడుల పెంపునకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2009-14 మధ్య కాలంలో బ్యాంకింగ్ పరపతి వృద్ధిలో పెరుగుదల కారణంగా 2014 తర్వాత కాలంలో బ్యాంకింగ్ రంగంలో రికవరీ కాని రుణాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రిజర్వు బ్యాంక్ తన డివిడెండు, మిగులు నిల్వలో ఉన్న రూ.1,76,000 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మొత్తంలో రూ.1,23,414 కోట్లు 2018-19 మిగులు కాగా రూ.52,637 కోట్లు సవరించిన ఆర్థిక మూలధన ఊట్చఝ్ఛ ఠీౌటజు కింద గుర్తించిన అదనపు నియమం ప్రకారం బదిలీ చేస్తారు. ఆర్.బి.ఐ. నుంచి మిగులు నిధుల బదిలీ కారణంగా ప్రభుత్వ రాబడి పెరిగి ద్రవ్యలోటు తగ్గుతుందని అంచనా. ద్రవ్య విధాన చర్యలను నిర్వర్తించడానికి, కరెన్సీ విలువలో ఒడిదుడుకులను తగ్గించడానికి, బాండ్ల విలువలో తగ్గుదలను అరికట్టడానికి, బహిరంగ మార్కెట్ చర్యల సంబంధిత స్థిరీకరణ వ్యయాల నిమిత్తం, అంతిమ రుణ దాత విధిని నిర్వర్తించే క్రమంలో క్రెడిట్ రిస్క్‌ను తగ్గించుకోవడానికి రిజర్వు బ్యాంక్ సరిపోయినంత మూలధన నిల్వలను కలిగి ఉండాలి.
  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వదేశీ కంపెనీలు, నూతన స్వదేశీ తయారీ కంపెనీలకు కార్పొరేషన్ పన్ను రేటును తగ్గిస్తున్నట్లు 2019 సెప్టెంబర్ 20న ప్రకటించారు. కార్పొరేషన్ పన్ను రేటును తగ్గిస్తూ ఆర్డినెన్‌‌సను తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. పన్ను మినహాయింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2019 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
పన్ను విధానంలో భాగంగా ముఖ్యాంశాలు:
  1. స్వదేశీ కంపెనీలు, నూతన స్వదేశీ తయారీ కంపెనీలకు సంబంధించి అన్ని సెస్‌లు, సర్‌ఛార్జీలు కలుపుకొని కార్పొరేషన్ పన్ను 25.17 శాతంగా ఉంటుంది. కార్పొరేషన్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం జరిగింది.
  2. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని వేగవంతం చేసే క్రమంలో తయారీ రంగంలో అధిక పెట్టుబడులను ఆకర్షించడానికి ఆదాయపు పన్ను చట్టంలో 2019-20 నుంచి నూతన సవరణ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టంలో భాగంగా 2019 అక్టోబర్ 1 తర్వాత తయారీ రంగంలో నూతన పెట్టుబడులకు సంబంధించి నూతన స్వదేశీ కంపెనీలపై ఆదాయపు పన్ను రేటును 15 శాతంగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. అన్ని విధాలైన సెస్‌లు, సర్‌ఛార్జీలు కలుపుకొని ఆదాయపు పన్నును తయరీ రంగ కంపెనీలు 17.01 శాతం చెల్లించాలి.
  3. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి 2019-20 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో మరో నియమాన్ని ప్రతిపాదించారు. ఏ విధమైన ప్రోత్సాహకాలు, మినహాయింపులు పొందని స్వదేశీ కంపెనీలపై 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను రేటును 22 శాతంగా ప్రతిపాదించారు. అన్ని విధాలైన సెస్‌లు, సర్‌ఛార్జీలు కలుపుకొని ఆదాయపు పన్ను రేటు ఆయా కంపెనీలపై 25.17 శాతంగా ఉంటుంది. ఆయా కంపెనీలను ‘కనీస ప్రత్యామ్నాయ పన్ను’ నుంచి మినహాయించారు.
  4. ప్రోత్సాహకాలు, మినహాయింపులను పొందుతున్న కంపెనీలపై కనీస ప్రత్యామ్నాయ పన్నును ప్రస్తుతమున్న 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు.
  5. 2019 జూలై 5 ముందు కాలంలో షేర్ల తిరిగి కొనుగోలును ప్రకటించిన లిస్టెడ్ కంపెనీల విషయంలో షేర్ల తిరిగి కొనుగోలుపై పన్ను మినహాయించారు.
  6. మూలధన మార్కెట్‌లో నిధుల ప్రవాహాన్ని స్థిరీకరించడానికి 2019 జూలై బడ్జెట్‌లో పెంచిన సర్‌ఛార్జి, కంపెనీ ఈక్విటీ షేర్లను విక్రయించినప్పుడు కలిగే మూలధన రాబడికి వర్తించదు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ఏదైనా సెక్యూరిటీని విక్రయించినప్పుడు కలిగే మూలధన రాబడికి కూడా పెంచిన సర్‌ఛార్‌‌జ వర్తించదని ఆర్థిక మంత్రి ప్రక టించారు.
  7. భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని వేగవంతం చేయడానికి ఆర్థిక మంత్రి ప్రకటించిన Stimulus విలువ రూ.1.45 లక్షల కోట్లు. ఈ మొత్తం జి.డి.పి.లో 1 శాతానికి సమానం. తద్వారా పెట్టుబడి, వృద్ధిలో పెరుగుదల సంభవిస్తుందని అంచనా.
మాదిరి ప్రశ్నలు:

Published date : 27 Sep 2019 04:36PM

Photo Stories