Skip to main content

అస్సాంలో దేశంలోనే పొడవైన నది రోప్‌వే

అస్సాం ప్రభుత్వం బ్రహ్మపుత్ర నదిపై 1.8 కిలోమీటర్ల పొడ‌వైన‌ రోప్‌వేను ప్రారంభించింది. దీన్ని భారతదేశంలోనే పొడవైన నది రోప్‌వేగా అభివర్ణించింది.

ప్రధానాంశాలు:

  1.     1.82 కిలోమీటర్ల ద్వి-కేబుల్ జిగ్-బ్యాక్ రోప్‌వే బ్రహ్మపుత్ర దక్షిణం వైపు నుంచి మరొక వైపు ఉన్న గువహతిలోని డౌల్ గోవింద ఆలయం వెనుక ఉన్న ఒక కొండను కలుపుతుంది.
  2.     ఇది న‌ది మ‌ధ్యలో ఉన్న మధ్యయుగానికి చెందిన‌ శివాలయం, ఉమానంద హౌస్ ఉన్న పీకాక్ ద్వీపం మీదుగా వెళుతుంది.
  3.     ఇది ఉత్తర, ద‌క్షిణ ఒడ్డుల‌ మధ్య ప్రయాణ సమయాన్ని 8 నిమిషాలకు తగ్గిస్తుంది.
  4.     రెండు ఓడ్డుల‌ మధ్య ప్రస్తుత ప్రయాణ ఎంపికలు ఫెర్రీ (30 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ, ప్రస్తుత సీజన్‌ను బట్టి) లేదా రోడ్డు ద్వారా వంతెన నుంచి ట్రాఫిక్‌లో వెళితే గంటకు పైగా పడుతుంది.
Published date : 09 Sep 2020 03:19PM

Photo Stories