Skip to main content

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీల నేపథ్యంలో.. ఈ పరీక్షల నిర్వహణపై జాగ్రత్తలు తీసుకోండి

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ పట్ల అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యా మండలి అధికారులను ఆదేశించారు.
Take care of the conduct of Common Entrance Tests
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఈ పరీక్షలన్నీ మే నెలలో జరగనున్న నేపథ్యంలో ఏప్రిల్‌ 18న అధికారులతో చర్చించారు. ఎంసెట్‌ భద్రత చర్యలపై జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు, ఎంసెట్‌ కన్వీనర్, ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మంత్రి ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీల నేపథ్యంలో భద్రతపై అధికారులు ఇప్పటికీ ఒక్క సమావేశం పెట్టుకోకపోవడాన్ని ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది.

చదవండి: ఎంసెట్‌ | నీట్ | టిఎస్ పాలీసెట్‌ | లాసెట్ | ఐసెట్‌

గతంలో కనీ్వనర్‌గా ఉన్న గోవర్థన్‌ ఎప్పటికప్పుడు వివరాలు పారదర్శకంగా ఉంచేవారని, ప్రస్తుత కన్వీనర్‌ కొత్త కావడం వల్ల ఏమీ తెలియడం లేదనే అభిప్రాయం మంత్రి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు సహకరించడం లేదని ఈ సందర్భంగా లింబాద్రి మంత్రి వద్ద వాపోయినట్టు తెలిసింది.

Published date : 19 Apr 2023 02:43PM

Photo Stories