Skip to main content

Gopal T K Krishna: ఓయూ పూర్వవిద్యార్థి భారీ విరాళం

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో 1968లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన విద్యార్థి గోపాల్‌ టీకే కృష్ణ రూ.5 కోట్ల విరాళాన్ని అందజేశారు.
OU alumnus Gopal T K Krishna donates Rs 5 cr

ఈ మేరకు ఫిబ్ర‌వ‌రి 26న‌ ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌కు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం తరగతి గదుల నిర్మాణానికి రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. నగరానికి చెందిన గోపాల్‌ టీకే కృష్ణ మెథడిస్ట్‌ బాయ్స్‌ హయ్యర్‌ సెండరీ స్కూల్‌లో చదివారు. ఓయూలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు.

చదవండి: OU PhD: కిరణ్ కుమార్ కు OU కెమికల్ ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ

కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్య మండలి కార్యదర్శి ప్రొ.శ్రీరామ్‌ వెంకటేష్‌, ప్రిన్సిపాల్‌ ప్రొ.చంద్రశేఖర్‌, ప్రొ.మంగు, అలూమ్ని అధ్యక్షులు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Published date : 27 Feb 2024 11:36AM

Photo Stories