స్పాట్ అడ్మిషన్ల వలన విద్యార్థుల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందన్నారు ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. ఈ విషయంపై ప్రభుత్వాన్ని ఆశ్రయించారు.
AP EAMCET Counselling for engineering students
సాక్షి ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్ చదువుకున్న విద్యార్థులకు నిర్వహించాల్సిన మూడో విడత కౌన్సెలింగ్ వెంటనే చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం డిమాండ్ చేశారు.
శుక్రవారం స్థానిక అమర్భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొన్ని కళాశాలల యాజమాన్యాలు స్పాట్ అడ్మిషన్లు కేటాయిస్తుండడం వల్ల మూడో విడత కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కౌన్సెలింగ్ నిర్వహించాలని కోరారు.