Skip to main content

National Cricket Academy: ఎన్‌సీఏ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న క్రికెటర్‌?

VVS Laxman and Ganguly

భారత క్రికెట్‌ జట్టు మాజీ ప్లేయర్, హైదరాబాద్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ త్వరలోనే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా బాధ్యతలను చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని నవంబర్‌ 14న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వెల్లడించాడు. గతంలో ఈ బాధ్యతల్లో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ ఇటీవలే భారత హెడ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌ను ఎన్‌సీఏ చీఫ్‌గా నియమించారు. ఎన్‌సీఏ చీఫ్‌గానే కాకుండా భారత్‌ ‘ఎ’, భారత్‌ అండర్‌–19 జట్లకు కోచ్‌గా కూడా లక్ష్మణ్‌ వ్యవహరించాల్సి ఉంటుంది.

ఫిఫా ప్రపంచకప్‌లో ఎన్ని జట్లు పాల్గొననున్నాయి?

2022 ఏడాది ఖతర్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ జట్టు అర్హత సాధించింది. ఫ్రాన్స్‌తోపాటు ప్రపంచ నంబర్‌వన్‌ బెల్జియం, 2018 ప్రపంచకప్‌ రన్నరప్‌ క్రొయేషియా జట్టు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. 32 జట్లు పాల్గొనే 2022–ప్రపంచకప్‌ టోర్నీకి ఇప్పటివరకు ఆతిథ్య ఖతర్‌ జట్టుతోపాటు జర్మనీ, డెన్మార్క్, బ్రెజిల్, బెల్జియం, ఫ్రాన్స్, క్రొయేషియా అర్హత పొందాయి.
 

చ‌ద‌వండి: హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న దివంగత క్రికెటర్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా బాధ్యతలను చేపట్టనున్న క్రికెటర్‌?
ఎప్పుడు    : నవంబర్‌ 14
ఎవరు    : భారత క్రికెట్‌ జట్టు మాజీ ప్లేయర్, హైదరాబాద్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌
ఎందుకు : గతంలో ఈ బాధ్యతల్లో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ ఇటీవలే భారత హెడ్‌ కోచ్‌గా నియమితులైన నేపథ్యంలో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Nov 2021 05:10PM

Photo Stories