Skip to main content

BWF World Tour: ఒలింపిక్‌ ఛాంపియన్‌కు షాకిచ్చిన ప్రణయ్‌

బ్యాడ్మింటన్‌ సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ను భారత ప్లేయర్‌ ప్రణయ్‌ సంచలన విజయంతో ముగించాడు.

వరుసగా తొలి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఓడిన ఈ కేరళ ఆటగాడు సెమీఫైనల్‌కు అర్హత పొందలేకపోయాడు. బ్యాంకాక్‌లో డిసెంబ‌ర్ 9న‌ జరిగిన పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘ఎ’ చివరి మ్యాచ్‌లో 12వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 14–21, 21–17, 21–18తో టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ అక్సెల్‌సన్‌ (డెన్మార్క్‌)పై గెలుపొందాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీఫైనల్‌ చేరిన అక్సెల్‌సన్‌కు ప్రణయ్‌తో 51 నిమిషాలపాటు జరిగిన పోరులో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. గ్రూప్‌ ‘ఎ’లో చివరి స్థానంలో నిలిచిన ప్రణయ్‌కు 9000 డాలర్ల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.  

Unnati Hooda: బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్ రన్నరప్‌గా ఉన్నతి హుడా

Published date : 12 Dec 2022 01:18PM

Photo Stories