Skip to main content

Federation Cup Athletics: 200 మీటర్ల విభాగంలో జ్యోతికి స్వర్ణ పతకం

జాతీయ ఫెడరేషన్‌ కప్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీ రెండో స్వర్ణ పతకం సాధించింది.
Jyothi Yarraji

విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి మే 18న‌ జరిగిన మహిళల 200 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. జ్యోతి 200 మీటర్ల రేసును అందరికంటే వేగంగా 23.42 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించింది. బుధవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ జ్యోతి బంగారు పతకం గెలిచింది. ఏడు క్రీడాంశాల సమాహారమైన హెప్టాథ్లాన్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌమ్య మురుగన్‌ పసిడి పతకాన్ని దక్కించుకుంది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)

Published date : 19 May 2023 06:25PM

Photo Stories