Skip to main content

Women's T20 శ్రీలంకతో T20 సీరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు

India Women vs Sri Lanka Women T20I match
India Women vs Sri Lanka Women T20I match

శ్రీలంక వేదికగా ఆ జట్టుతో జరిగిన మహిళల టీ20 సీరీస్ ను భారత 2 - 1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి రెండు టీ20 లో విజయం సాధింటిన టీమిండియా, ఆఖరి మ్యాచ్ లో ఓడిపోయి  2–1తో సీరీస్ గెలుచుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత టి20 మ్యాచ్‌లో భారత జట్టుపై శ్రీలంక గెలిచింది. చివరిసారి ఆ జట్టు 2014లో భారత్‌ను ఓ టి20 మ్యాచ్‌లో ఓడించింది. అంతేకాకుండా స్వదేశంలో భారత్‌పై శ్రీలంకకిదే తొలి విజయం కావడం విశేషం. 

Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?

శ్రీలంక పురుషులు, మహిళలకు సంబంధించిన టి20 చరిత్రలో 2000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి క్రికెటర్‌ గా చమరి ఆటపట్టు రికార్డు సృష్టించింది. మాజీ క్రికెటర్‌ తిలకరత్నే దిల్షాన్‌ (1889; అత్యధిక టి20 స్కోరర్‌)ను ఆమె ఎప్పుడో దాటేసింది. 
 

Published date : 28 Jun 2022 06:23PM

Photo Stories