Asian President's Cup: ఆసియా ప్రెసిడెంట్ కప్ విజేత భారత్
Sakshi Education
భారత హ్యాండ్బాల్ చరిత్రలో చిరస్మరణీయ సందర్భం. జోర్డాన్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ఆసియా ప్రెసిడెంట్కప్ టోర్నీలో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది.

టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్.. ఓవరాల్గా 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని ముద్దాడింది. ప్రెసిడెంట్ కప్ టోర్నీ గెలువడం భారత అమ్మాయిలకు ఇది తొలిసారి కావడం విశేషం. రౌండ్ రాబిన్ లీగ్పద్ధతిలో జరిగిన టోర్నీలో శైలజశర్మ నాయకత్వంలోని భారత్ ఆడిన ఆరు మ్యాచ్ల్లో తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 24 Feb 2023 06:23PM