Skip to main content

BWF Rankings: తొలిసారి టాప్‌–20లోకి గాయత్రి జోడీ

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) మహిళల డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి తన భాగస్వామి ట్రెసా జాలీ (కేరళ)తో కలిసి కెరీర్‌ బెస్ట్‌ 19వ ర్యాంక్‌కు చేరుకుంది.

నవంబర్‌ 29వ తేదీ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం రెండు స్థానాలు పురోగతి సాధించి భారత నంబర్‌వన్‌ జోడీగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ రెండు స్థానాలు ఎగబాకి మరోసారి కెరీర్‌ బెస్ట్‌ ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 

బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భార‌త్‌కు 11 పతకాలు

Published date : 30 Nov 2022 03:59PM

Photo Stories