Skip to main content

Grandmaster: టాటా ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీ టైటిల్‌ నెగ్గి క్రీడాకారుడు?

Arjun Erigaisi

టాటా స్టీల్‌ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) ఎరిగైసి అర్జున్‌ చాంపియన్‌గా అవతరించాడు. తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో వరంగల్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల అర్జున్‌ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొని విజేతగా నిలిచాడు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని నగరం కోల్‌కతాలో నవంబర్‌ 19న ఈ టోర్నీ ముగిసింది.

భారత్‌కి చెందిన ప్రవీణ్‌ జాదవ్‌ ఏ క్రీడకు చెందినవాడు?

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో నవంబర్‌ 19న ముగిసిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆఖరి రోజు రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు రెండు రజతాలు లభించాయి. కపిల్, ప్రవీణ్‌ జాదవ్, పార్థ్‌ సాలుంకేలతో కూడిన భారత పురుషుల జట్టు 2–6తో దక్షిణ కొరియా జట్టు... అంకిత, మధు, రిధిలతో కూడిన భారత మహిళల జట్టు 0–6తో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయి రజత పతకాలకు దక్కించుకున్నాయి.
చ‌ద‌వండి: టి20 ప్రపంచకప్‌–2021లో విజేతగా నిలిచిన దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : టాటా స్టీల్‌ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)?
ఎప్పుడు : నవంబర్‌ 19
ఎవరు    : ఎరిగైసి అర్జున్‌
ఎక్కడ    : కోల్‌కతా, పశ్చిమ బెంగాల్‌ 
ఎందుకు : ఈ టోర్నీలో అర్జున్‌ 6.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకొన్నందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Nov 2021 02:41PM

Photo Stories