Skip to main content

ISRO LVM 3 - M2 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(ఎస్‌డీఎస్‌సీ) ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లిన నూతన లాంచ్‌వెహికల్‌ఎం3–ఎం2 రాకెట్‌ విజయవంతంగా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ఇస్రో ఒక చరిత్రాత్మక వాణిజ్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది.
ISRO LVM3 - M2
ISRO LVM3 - M2

ఈ రకం రాకెట్‌ను వాణిజ్యపరమైన ప్రయోగాలకు వాడటం ఇదే తొలిసారి. తొలి యత్నంలోనే ఇస్రో గ‘ఘన’ విజయం సొంతం చేసుకుంది. అక్టోబర్ 22న అర్థరాత్రి 12 గంటల 7 నిమిషాల 40 సెకన్లకు స్పేస్‌సెంటర్‌ రెండో ప్రయోగవేదికగా ఈ రాకెట్‌ను ప్రయోగించారు. ఒకేసారి 36 బ్రాడ్‌బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్లను పోలార్‌ లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌(ఎల్‌ఈఓ)లో ప్రవేశపెట్టారు. ఇస్రోకు చెందిన వాణిజ్యవిభాగం న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేస్తున్న తొలి వాణిజ్యపర ప్రాజెక్ట్‌ ఇది. బ్రిటన్‌కు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేటెడ్‌ లిమిటెడ్, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ భాగస్వాములుగా వన్‌వెబ్‌ ఇండియా లిమిటెడ్‌ను ఏర్పాటుచేశారు. వన్‌వెబ్‌ ఇండియా–1 పేరిట 36 ఉప్రగ్రహాలను కక్ష్యలో పంపేందుకు వన్‌వెబ్‌తో న్యూస్పేస్‌ ఇండియా ఒప్పందం చేసుకుంది. వన్‌వెబ్‌ లిమిటెడ్‌ అనేది వివిధ దేశాల ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు అంతరిక్ష, ఇంటర్నెట్‌ సేవలు అందించే గ్లోబల్‌ కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌ సంస్థ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 648 శాటిలైట్లను నిర్వహిస్తోంది.  

Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన జరుపుకుంటారు?

రాకెట్‌ పేరు మార్చారు 
జీఎల్‌ఎల్‌వీ–ఎంకే3గా ఇన్నాళ్లు పిలవబడిన రాకెట్‌నే కాస్త ఆధునీకరించి కొత్తగా లాంచ్‌వెహికల్‌ ఎం3–ఎం2గా నామకరణం చేయడం గమనార్హం. జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్య(జీటీవో)లోకి శాటిలైట్లను పంపే రాకెట్లకే జీఎస్‌ఎల్‌వీగా పిలుస్తున్నారు. శనివారం నాటి రాకెట్‌ జీటీవోకి పంపట్లేదు. ఎల్‌ఈఓలోకి పంపుతోంది. అందుకే దీనిని వేరే పేరుపెట్టారు. జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ కక్ష్య(జీటీఓ)లోకి 4,000 కేజీల బరువును, ఎల్‌ఈఓలోకి దాదాపు 8,000 కేజీల బరువును తీసుకెళ్లే సత్తా లాంచ్‌వెహికల్‌ ఎం3–ఎం2 రాకెట్‌ సొంతం. 

ప్రయోగం ప్రత్యేకతలు 

  • ∙36 శాటిలైట్ల మొత్తం బరువు 5,796 కేజీలు. 
  • ∙ఇంతటి బరువును 43.5 మీటర్ల ఎత్తయిన ఒక భారతీయ రాకెట్‌ మోసుకెళ్లడం ఇదే తొలిసారి.  
  • ∙ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్‌తో తొలి వాణిజ్యపరమైన ప్రయోగం 
  • ∙ఈ రకం రాకెట్‌తో లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాలు పంపడం ఇదే ప్రథమం

ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని  ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్‌ కంపెనీతో న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

Also read: Weekly Current Affairs (Persons) Bitbank: ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?

వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం
ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్‌ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్‌ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్‌ చైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్‌ గోయెంకా (వన్‌వెబ్‌ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలను ఒకే రాకెట్‌ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు.

చంద్రయాన్, గగన్‌యాన్‌ ఈ రాకెట్‌తోనే...
చంద్రయాన్‌–3 ప్రయోగానికి ఎం3–ఎం2 రకం రాకెట్‌నే వాడతామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. గగన్‌యాన్‌కు సంబంధించి మానవ రహిత ప్రయోగం, మానవ సహిత ప్రయోగాన్ని ఈ రాకెట్‌లతో నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 4 ప్రయోగాలకు చేస్తామన్నారు. నవంబర్‌ మొదట్లో పీఎస్‌ఎల్‌వీ సీ54 రాకెట్‌ ద్వారా ఓషన్‌శాట్‌ 3, డిసెంబర్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ2, జీఎస్‌ఎల్‌వీ మార్క్‌2 రాకెట్‌ ద్వారా 4 నావిగేషన్‌ ఉపగ్రహాలు, పీఎస్‌ఎల్‌వీ సీ55 రాకెట్‌ ద్వారా సూర్యునిపై శోధనకు ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహ ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు. వన్‌వెబ్‌కు చెందిన మరికొన్ని శాటిలైట్లను 2023 తొలినాళ్లలో ప్రయోగిస్తామని ఇస్రో వెల్లడించింది. అంతకుముందు శుక్రవారం రాత్రి స్పేస్‌సెంటర్‌కు చేరుకున్న ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ శనివారం ఉదయం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎల్‌వీఎం3–ఎం2 రాకెట్‌ విజయవంతంకావడంతో వాణిజ్యపరంగా ఇస్రోకు ఇది భారీ ఆదాయాన్ని తెచి్చపెట్టే అంతరిక్ష ఆయుధంగా మారింది. వాణిజ్యపర ప్రయోగాలకు ఇన్నాళ్లూ పీఎస్‌ఎస్‌వీ రాకెట్లు వాడారు. 

Also read: Weekly Current Affairs (Science & Technology) Bitbank: పశ్చిమ కనుమలలో పర్పుల్-బ్లూ రంగులో ఏ పువ్వులు వికసిస్తాయి?

Published date : 25 Oct 2022 04:48PM

Photo Stories