Skip to main content

RYTHU BIMA: రైతు బీమాకు రూ. 1,450 కోట్లు.. ఒక్కో రైతుకు రూ.3,830 చొప్పున చెల్లింపు

ఈ ఏడాదికి సంబంధించిన రైతు బీమా ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఒక్కో రైతుకు రూ.3,830 చొప్పున మొత్తం రూ.1,450 కోట్లు చెల్లించింది.
Rs 3,384.95 crore insurance amount
Rs 3,384.95 crore insurance amount

గతేడాది కంటే ఎక్కువగా రైతులు ఈ పథకం కింద నమోదు అయ్యారు. గతేడాది 35.64 లక్షల మంది లబి్ధదారులు ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 37.77 లక్షలకు చేరినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అంటే అదనంగా 2.13 లక్షల మంది రైతులు నమోదు చేసుకున్నారు. 

Also read: Lumpy skin disease (LSD): వణికిస్తున్న లంపీ ముప్పు.. పాడి పశువుల్లో వ్యాపిస్తున్న వ్యాధి

2018 ఆగస్టు 14వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. 
బీమా పరిధిలోని రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబాలకు (నామినీ) పరిహారంగా ఎల్‌ఐసీ రూ.5 లక్షలు అందజేస్తుంది. 

గతేడాది కంటే ప్రీమియం తగ్గుదల 
గతేడాది కంటే ప్రీమియం సొమ్మును తగ్గించేలా ఎల్‌ఐసీతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. గతేడాది ఒక్కో రైతుకు రూ.4,110 చొప్పున చెల్లించగా, ఈ ఏడాది రూ.3,830 మాత్రమే చెల్లించారు. ఆ ప్రకారం గతేడాది 35.64 లక్షల మంది రైతులకు రూ.1,465 కోట్లు చెల్లించగా, ఈసారి 37.77 లక్షల మంది రైతులకు రూ.1,450 కోట్లు చెల్లించారు.  

Also read: Quiz of The Day (September 22, 2022): మన దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది?

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 22 Sep 2022 04:53PM

Photo Stories