Skip to main content

Telangana రాష్ట్ర ఖజానాకు మరో రూ.2,500 కోట్ల రుణాలు

ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆరంభంలోనే రాష్ట్ర ఖజానాకు రూ.2,500 కోట్లు రుణాల రూపంలో సమకూరాయి. ఈ నెల 3న జరిగిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) వేలంలో బాండ్ల ద్వారా ఈ మొత్తాన్ని రాష్ట్రప్రభుత్వం సమకూర్చుకుంది.
Another Rs 2,500 crore in loans to the Telangana state exchequer
Another Rs 2,500 crore in loans to the Telangana state exchequer

    దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను అప్పులచిట్టా రూ.22,500 కోట్లకు చేరింది. గత రెండు త్రైమాసికాల్లో కలిపి రూ.20 వేలకోట్లను రుణాలుగా సమీకరించుకుంది. ఈ నెలలోనే మరో రూ.1,500 కోట్లను అప్పులరూపంలో తీసుకోనుంది. దీంతో ఈ నెలాఖరుకల్లా రాష్ట్ర ప్రభుత్వ అప్పులచిట్టా రూ.23,500 కోట్లకు చేరనుంది. ఇక, మూడో త్రైమాసికంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.8,500 కోట్లకుపైగా రుణాలు తీసుకోనుందని ఆర్బీఐ కేలండర్‌ చెబుతోంది. ఈ కేలండర్‌ ప్రకారం రానున్న రెండు నెలల్లో రూ.4,500 కోట్లకుపైగా రుణాలు తీసుకోనుంది. ఈ నెల 11న రూ.500 కోట్లు, 25న రూ.500 కోట్లు, నవంబర్‌ 1న రూ.1,500 కోట్లు, 15న రూ.1,000 కోట్లు, 29న రూ.500 కోట్లు, డిసెంబర్‌ 6న రూ.1,500 కోట్లు, 13న రూ.500 కోట్లను రుణం రూపంలో వేలం ద్వారా సమీకరించుకోనుంది. దీంతో మూడో త్రైమాసికం ముగిసేసరికి దాదాపు రూ.30 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులచిట్టా చేరనుంది. ఇక, మిగిలిన త్రైమాసికంలో మరో ఏడెనిమిది వేల కోట్ల రూపాయల మేర ఆర్బీఐ వేలం ద్వారా రుణాలను సమీకరించుకునే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.   

Also read: Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 4th కరెంట్‌ అఫైర్స్‌

Published date : 08 Oct 2022 08:25PM

Photo Stories