AP Government: టెలీమెడిసిన్ సేవల్లో ఏపీ రికార్డు
Sakshi Education
టెలీమెడిసిన్ సేవల్లో ఏపీ ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే ఒక్కరోజులో లక్ష కన్సల్టేషన్ల మైలురాయిని దాటిన తొలి రాష్ట్రంగా ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా జూలై 4న 2,04,858 కన్సల్టేషన్లు నమోదవగా ఇందులో 48.89 శాతం అంటే 1,00,159 కన్సల్టేషన్లు ఏపీలోనే నమోదయ్యాయి. తమిళనాడు నుంచి 34వేలు, కర్ణాటకలో 15వేలు, తెలంగాణాలో 5,574, కేరళలో 543 చొప్పున నమోదయ్యాయి. వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఈసంజీవని టెలీమెడిసిన్ సేవలను 2019 నవంబర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి.
Published date : 06 Jul 2022 04:03PM