Skip to main content

Andhra Pradesh: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

YSR EBC Nestam scheme

ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ మహిళల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 25న తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 3,92,674 మంది అర్హులైన అగ్రవర్ణ పేద మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్ధిక సాయాన్ని నేరుగా జమ చేశారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళలందరికీ ఏటా రూ.15 వేల చొప్పున వచ్చే మూడేళ్లలో రూ.45 వేలు అందించనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు పథకం వర్తిస్తుంది. మహిళల ఆర్ధిక సాధికారిత, ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు ఈబీసీ నేస్తం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌లో ఐటీ టవర్, టైక్స్‌టైల్‌ పార్క్‌..

ఆదిలాబాద్‌లో త్వరలో ఐటీ టవర్‌తోపాటు టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తామని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామరావు అన్నారు. ఎన్‌డీబీఎస్‌ ఇండియా ఎండీ, సంజీవ్‌ దేశ్‌పాండే ఐటీ టవర్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చారని జనవరి 26న వెల్లడించారు.

చ‌ద‌వండి: కొత్తగా ఎన్ని జిల్లాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎప్పుడు : జనవరి 26
ఎవరు    : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
ఎక్కడ    : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి, గుంటూరు జిల్లా
ఎందుకు : బ్రాహ్మణ, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, ముస్లిం ఇతర అగ్రవర్ణ పేద మహిళల ఆర్ధిక సాధికారిత కోసం..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 27 Jan 2022 05:31PM

Photo Stories