Skip to main content

University Grants Commission: యూజీసీ చైర్మన్‌గా నియమితులైన తొలి తెలుగు వ్యక్తి?

M Jagadesh Kumar

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ నియమితులయ్యారు.  కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ డిపి సింగ్‌ పదవీకాలం ముగియడంతో 2021, డిసెంబర్‌ 7న పదవీ విరమణ చేశారు. అప్పటినుంచి ఖాళీగా ఉన్న పోస్టుకు ప్రకటన ఇవ్వడంతో, 55 మంది దరఖాస్తు చేసుకోగా జగదీశ్‌ ఎంపికయ్యారు. దీంతో యూజీసీ చైర్మన్‌గా నియమితులైన  మూడో తెలుగు వ్యక్తిగా జగదీశ్‌ నిలిచారు. ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు. 1961లో డాక్టర్‌ వాసిరెడ్డి శ్రీకృష్ణ, 1991 నుంచి 1995 వరకు జి.రామిరెడ్డి యూజీసీ చైర్మన్లుగా పనిచేయగా, ఇప్పుడు జగదీశ్‌  నియమితులయ్యారు. 60 ఏళ్ల జగదీశ్‌ కుమార్‌ ప్రస్తుతం ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌చాన్స్‌లర్‌గా పనిచేస్తున్నారు. యూజీసీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 

నల్లగొండ వాసి..

  • నల్లగొండ జిల్లా తిప్పర్తిమండలం మామిడాల గ్రామానికి చెందిన జగదీశ్ కుమార్ డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ హైదరాబాద్‌లో చదివారు. ఆ తరువాత ఐఐటీ మద్రాసులో ఎంఎస్, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆ తరువాత పోస్ట్‌ డాక్టో్టరల్‌ రీసెర్చ్‌ కోసం కెనడా వెళ్లి 1994లో స్వదేశానికి తిరిగి వచ్చారు. 
  • 1995లో ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. 2013లో ఐఐటీ ఢిల్లీ నుంచి ‘అవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ టీచింగ్‌’ అందుకున్నారు. 
  • ఎలక్ట్రానిక్‌ ఇంజనీరింగ్‌లో నిష్ణాతుడైన ఆయన 2016 ఢిల్లీ జేఎన్‌యూ వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.    
  • అనంతరం కేంద్ర ప్రభుత్వ  సాంస్కృతిక మంత్రిత్వ శాఖలోని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ మ్యూజియమ్స్‌ పాలకమండలి చైర్మన్‌గా, నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్‌గా, యూజీసీ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) సభ్యునిగా ఉన్నారు. 
  • ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజనీరింగ్, ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్స్‌ ఫెలో అందుకున్నారు.
  • సెమీకండక్టర్‌ డివైజ్‌ డిజైన్, మోడలింగ్‌ రంగంలో విశేష కృషికి గాను ఆయనకు 29వ ఐఈటీఈ రామ్‌లాల్‌ వాధ్వా గోల్డ్‌ మెడల్‌ లభించింది. 
  • భారతదేశ ఎలక్ట్రానిక్స్‌ – సెమీకండక్టర్‌ అసోసియేషన్‌ అందించే మొట్టమొదటి ఐఎస్‌ఏ అండ్‌ వీఎస్‌ఐ టెక్నోమెంటర్‌ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2008 ఐబీఎం ఫ్యాకల్టీ అవార్డును పొందారు.

చ‌ద‌వండి: కథానాయకుడు జాషువా పుస్తకాన్ని ఎవరు రచించారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) చైర్మన్‌గా నియమితులైన మూడో తెలుగు వ్యక్తి?
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు    : ప్రొఫెసర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : యూజీసీ చైర్మన్‌గా పనిచేసిన ప్రొఫెసర్‌ డిపి సింగ్‌ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Feb 2022 01:39PM

Photo Stories