Skip to main content

Hindustan Petroleum: హెచ్‌పీసీఎల్‌ కొత్త చైర్మన్‌గా ఎంపికైన వ్యక్తి?

HPCL

దేశంలోని మూడవ అతిపెద్ద ఆయిల్‌ రిఫైనింగ్, మార్కెటింగ్‌ కంపెనీ హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కొత్త చైర్మన్‌ ఎండీగా పుష్పకుమార్‌ జోషి (58) ఎంపికయ్యారు. ఈ మేరకు జనవరి 25న ఒక ప్రకటన వెలువడింది. అయితే పీఈఎస్‌బీ చేసిన సిఫారసుకు ప్రధానమంత్రి నేతృత్వంలోని నియామకాల కేబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఆమోదముద్ర పడాల్సి ఉంది. 2022, ఏప్రిల్‌ 30న హెచ్‌పీసీఎల్‌ ప్రస్తుత చైర్మన్‌ ముకేశ్‌ కుమార్‌ సురానా పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పుష్పకుమార్‌ నియామకం జరిగింది. ప్రస్తుతం హెచ్‌పీసీఎల్‌ మానవ వనరుల విభాగంలో డైరెక్టర్‌గా పుష్పకుమార్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

73వ గణతంత్ర దినోత్సవం

ప్రస్తుతం బలమైన, సునిశితమైన భారత్‌ ఆవిర్భవిస్తోందని రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ అభిప్రాయపడ్డారు. గణతంత్ర దినోత్సవాల్లో భారతీయతను కనబరచాలని దేశ ప్రజలను ఆయన కోరారు. కరోనాను ఎదుర్కోవడంలో ఇండియా సాటిలేని తెగువను చూపిందని ఆయన ప్రశంసించారు. 73వ గణతంత్ర దినోత్సవం(2022, జనవరి 26) సందర్భంగా ఆయన జనవరి 25న దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

చ‌ద‌వండి: ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) కొత్త చైర్మన్‌ ఎండీగా ఎంపిక
ఎప్పుడు : జనవరి 25
ఎవరు    : హెచ్‌పీసీఎల్‌ మానవ వనరుల విభాగం డైరెక్టర్‌  పుష్పకుమార్‌ జోషి
ఎందుకు : 2022, ఏప్రిల్‌ 30న హెచ్‌పీసీఎల్‌ ప్రస్తుత చైర్మన్‌ ముకేశ్‌ కుమార్‌ సురానా పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Jan 2022 02:35PM

Photo Stories