Skip to main content

Andhra Pradesh: ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన పద్మశ్రీ అవార్డీ?

Dr Dattatreyudu Nori

రేడియేషన్‌ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణ)గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ని కేబినెట్‌ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ సెప్టెంబర్‌ 30న ఉత్తర్వులు జారీ చేసింది. రేడియేషన్‌ ఆంకాలజీలో డాక్టర్‌ నోరికి 43 ఏళ్ల అనుభవం ఉంది. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు పొందారు. క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్‌ నోరిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేసిన విషయం విదతమే.

స్పేస్‌టెక్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ రూపకల్పన


ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సాంకేతికత (స్పేస్‌ టెక్నాలజీ)కు తెలంగాణ రాష్ట్రాన్ని తొలి గమ్యస్థానంగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత రంగానికి చెందిన పరిశ్రమలు, విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఇప్పటికే ‘తెలంగాణ స్పేస్‌టెక్‌ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌’ను రూపొందించింది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను తాజాగా విడుదల చేసింది.

చ‌ద‌వండి: నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్‌ అధికారి?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్‌ సంరక్షణ)గా నియామకం
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 30
ఎవరు    : ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు
ఎందుకు : క్యాన్సర్‌ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు...

Published date : 01 Oct 2021 05:56PM

Photo Stories