Skip to main content

Air India Board: ఎయిర్‌ ఇండియా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?

N Chandrasekaran

ఎయిర్‌ ఇండియా చైర్మన్‌గా టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. ఎయిర్‌ ఇండియా బోర్డ్‌ ఈ మేరకు ఆయనకు ఈ కొత్త పదవి అప్పగించినట్టు సమాచారం. సీఈవో, ఎండీ నియామకం ఇంకా చేపట్టాల్సి ఉంది. టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ మాజీ చైర్మన్‌ ఇల్కర్‌ ఐజును ఎయిర్‌ ఇండియా సీఈవో, ఎండీగా  టాటా సన్స్‌ ప్రకటించింది. పాకిస్తాన్‌ మిత్రదేశమైన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు ఐజు సన్నిహితుడు. దీనిపై తలెత్తిన విమర్శల నేప థ్యంలో తన నియమకాన్ని ఐజు తిరస్కరించారు.

Life Insurance Corporation of India: ఎల్‌ఐసీ సీఎఫ్‌వోగా ఎవరు నియమితులయ్యారు?

ఐఆర్‌డీఏఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన అధికారి?  
భారత బీమా, నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) చీఫ్‌గా దేవాశిష్‌ పాండా మార్చి 14న బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. బీమా రంగ రెగ్యులేటర్‌ చైర్మన్‌గా వారం క్రితం దేవాశిష్‌ను నియమిస్తున్నట్లు మార్చి 11వ తేదీన కేంద్రం ప్రకటించింది. పాండా గతంలో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ అయిన పాండా, ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందినవారు.

GK Economy Quiz: 2022 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉన్న దేశం?
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ఎయిర్‌ ఇండియా చైర్మన్‌గా నియమితులైన వ్యక్తి?
ఎప్పుడు  : మార్చి 14
ఎవరు    : టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌  
ఎందుకు : ఎయిర్‌ ఇండియా బోర్డ్‌ నిర్ణయం మేరకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Mar 2022 01:03PM

Photo Stories