Supreme Court: గుజరాత్ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Sakshi Education

గుజరాత్–2002 అల్లర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. గతంలో సిట్ ప్రధాని మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ.. హింసాకాండలో మరణించిన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య.. జాకియా జఫ్రీ వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గతంలో సిట్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్, దినేశ్ మహేశ్వరి, సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 04 Jul 2022 07:17PM