Netaji Subhash Chandra Bose: నేతాజీ భారీ విగ్రహన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
![Subhash Chandra Bose Statue](/sites/default/files/images/2022/01/22/subhash-chandra-bose-statue-1642839737.jpg)
స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని న్యూఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ జనవరి 21న ప్రకటించారు. నేతాజీకి భారతజాతి రుణపడి ఉందని, 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని విగ్రహ ఏర్పాటు ఆయనకిచ్చే నివాళని ప్రధాని పేర్కొన్నారు. గ్రానైట్తో ఏర్పాటయ్యే విగ్రహం తయారీ పూర్తయ్యేవరకు, ఆ స్థానంలో హోలోగ్రామ్ను ఉంచనున్నట్లు తెలిపారు.
28 అడుగుల ఎత్తు..
నేతాజీ విగ్రహం 28 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పు కలిగి ఉంటుందని అధికారులు తెలిపారు. కింగ్జార్జ్5కి విగ్రహ ఏర్పాటు చేసినట్టుగా ఓ మండపం కింద విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
జనవరి 23న పరాక్రమ దివస్గా..
నేతాజీ జయంతి(జనవరి 23) సందర్భంగా ప్రతి ఏటా జనవరి 23న పరాక్రమ దివస్గా జరపనున్నట్లు 2021 సంవత్సరంలో కేంద్రం ప్రకటించింది. విపత్తు నిర్వహణ రంగంలో నిస్వార్థ సేవను అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారం అందజేయనుంది. వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు, సర్టిఫికెట్ను, సంస్థకయితే 51 లక్షల నగదు, సర్టిఫికెట్ను అందజేయనుంది. 2019, 2020, 2021, 2022 సంవత్సరాలకు సంబంధించిన పురస్కారాలను జనవరి 23వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రదానం చేస్తారు. మొత్తం ఏడు అవార్డులను ఈ సందర్భంగా అందజేయనున్నారు.
చదవండి: అమరజవాన్ జ్యోతిని ఎందులో విలీనం చేశారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వాతంత్య్ర సమరయోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహం ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఇండియాగేట్ వద్ద, న్యూఢిల్లీ
ఎందుకు : నేతాజీ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని..
డౌన్లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్లోడ్ ఇలా...
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్