Skip to main content

Bilkis Bano Case: బిల్కిస్‌ కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనం

గోధ్రా అల్లర్ల బాధితురాలు బిల్కిస్‌ బానో కేసులో దోషులుగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్న 11 మందిని ముందస్తుగా విడుదల చేసిన అంశాన్ని విచారించేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని సర్వోన్నత న్యాయస్థానం మరోమారు స్పష్టం చేసింది.
Bilkis Bano Case

బాధితురాలిని గ్యాంగ్‌రేప్‌ చేసి ఆమె కుటుంబసభ్యులు ఏడుగురిని హత్య చేసిన దోషులకు వర్తింపజేసిన రెమిషన్‌(ముందస్తు విడుదల)ను వ్యతిరేకిస్తూ బిల్కిస్‌ తరఫున శోభా గుప్తా సుప్రీంకోర్టులో మార్చి 22న‌ కేసును వాదించారు. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ జేబీ పార్ధివాలాల ధర్మాసనం విచారించింది. ‘ఈ అంశాన్ని విచారించేందుకు ప్రత్యేకంగా బెంచ్‌ను ఏర్పాటుచేస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్‌ గుప్తాకు హామీ ఇచ్చారు. 


ఈ కేసును వీలైనంత త్వరగా విచారించాలని ఫిబ్రవరి ఏడో తేదీనే బిల్కిస్‌ న్యాయవాది కోర్టును కోరగా అప్పటి నుంచీ ఈ కేసు కనీసం విచారణకు నోచుకోలేదు. ఫిబ్రవరి 24వ తేదీన విచారణకు వచ్చినా అదే బెంచ్‌లోని జడ్జీలు అనాయాస మరణానికి సంబంధించిన వేరే కేసును విచారించే ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉండటంతో ఈ విచారణ వీలుకాలేదు. యావజ్జీవ ఖైదీలను ముందస్తుగా విడుదల చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని గుజరాత్‌ రాష్ట్ర సర్కార్‌ చెప్పడంతో అందుకు అనుమతిస్తూ కోర్టు సమ్మతి తెలపడంతో ఆ ఖైదీలు గత ఏడాది విడుదలయ్యారు. 

Mehul Choksi: మెహుల్‌ చోక్సీపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ ఎత్తివేత !

Published date : 23 Mar 2023 03:50PM

Photo Stories