Skip to main content

Reliance Industries: దేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ ఎక్కడ ప్రారంభమైంది?

Jio World Center

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) మార్చి 4న ముంబైలో జియో వరల్డ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. దాదాపు 18.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్‌లో సాంస్కృతిక కేంద్రం, మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ మొదలైనవి ఉన్నాయి. ఇందులోని కన్వెన్షన్‌ సెంటర్‌ దేశంలోనే అతి పెద్దది. 5జీ నెట్‌వర్క్‌ ఆధారిత కన్వెన్షన్‌ సెంటర్‌లో 1.61 లక్షల చ.అ. పైగా విస్తీర్ణం ఉండే మూడు ఎగ్జిబిషన్‌ హాల్స్, 1.07 లక్షల చ.అ. విస్తీర్ణం ఉండే రెండు కన్వెన్షన్‌ హాల్స్‌ ఉంటాయి. 2022 ఏడాది, 2023 ఏడాది దశలవారీగా ఇందులోని వివిధ విభాగాలను సంస్థ ఆవిష్కరించనుంది. నవ భారత ఆకాంక్షలకు ప్రతిరూపంగా జియో వరల్డ్‌ సెంటర్‌ ఉంటుందని ఆర్‌ఐఎల్‌ డైరెక్టర్, రిలయన్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ నీతా అంబానీ తెలిపారు.

ABDM: ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ప్రధాన ఉద్దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : దేశంలోనే అతి పెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ ఎక్కడ ప్రారంభమైంది?
ఎప్పుడు    : మార్చి 4
ఎవరు    : పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) 
ఎక్కడ    : జియో వరల్డ్‌ సెంటర్, ముంబై, మహారాష్ట్ర

​​​​​​​డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 05 Mar 2022 02:16PM

Photo Stories