Skip to main content

PM Modi: ఇటీవల ఏ రాష్ట్రంలో 2,985 అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు?

PM Modi Launches Amrit Sarovar Project In Assam
PM Modi Launches Amrit Sarovar Project In Assam

ఇటీవల అస్సాం రాష్ట్రంలో 2,985 అమృత్‌ సరోవర్‌ ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే దిఫూలో ‘శాంతి, ఐక్యత, అభివృద్ధి’ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. కర్బీ అంగ్లాంగ్‌లో పశువైద్య కళాశాల సహా పలు విద్యాసంస్థలకు ఆయన శంకుస్థాపన చేశారు. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం, టాటా ట్రస్టులు సంయుక్తంగా ‘అస్సాం కేన్సర్‌ కేర్‌ ఫౌండేషన్‌ (ఏసీసీఎఫ్‌)’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడు కేన్సర్‌ చికిత్స కేంద్రాలను మోదీ ప్రారంభించారు. మరో ఏడింటికి శంకుస్థాపన చేశారు. 

Sikhism: సిక్కుల తొమ్మిదో గురువు ఎవరు?

Published date : 10 May 2022 06:35PM

Photo Stories