PM Modi: రూ.22వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన
Sakshi Education
ఆత్మనిర్భర్ భారత్కు రక్షణ, ఏరోస్పేస్ రంగాలు మూలస్తంభాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

గుజరాత్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. వడోదరలో సీ–295 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రూ.22వేల కోట్ల వ్యయంతో టాటాల భాగస్వామ్యంతో ఎయిర్బస్ సంస్థ చేపడుతోంది. విమానయాన రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా మోదీ పేర్కొన్నారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 11 Nov 2022 05:37PM