Nuclear Power: 2047 కల్లా దేశంలో 9 శాతం అణు విద్యుత్తు
Sakshi Education
![India to receive 9% power from nuclear sources by 2047](/sites/default/files/images/2023/04/21/nuclear-power-1682079315.jpg)
భారతదేశంలో 2047 కల్లా 9 శాతం విద్యుత్తు అణు వనరుల నుంచే ఉత్పత్తి అవుతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. ఇటీవల ఆయన ముంబయిలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కార్యకలాపాలపై సమీక్ష జరిపారు. 2070కల్లా కర్బన ఉద్గారాల్లో నెట్ జీరో తటస్థతకు చేరుకోవాలన్న భారత్ లక్ష్యంలో అణుశక్తి కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. 2030 కల్లా 20 గిగావాట్ల అణు ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అప్పుడు అమెరికా, ఫ్రాన్స్ తర్వాత అణుఇంధన ఉత్పత్తి దేశాల్లో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని తెలిపారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)
Published date : 21 Apr 2023 05:45PM