Skip to main content

Cable Bridge: దేశంలో తొలి తీగల రైల్వే వంతెన సిద్ధం

India first cable stayed rail bridge is ready

రైల్వేశాఖ మరో ఘనతకు చేరువైంది. జమ్మూలోని రియాసీ జిల్లాలో చేపట్టిన దేశంలోనే మొట్టమొదటి తీగల రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 11 నెలల వ్యవధిలో ఈ రైల్వే వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. వంతెనను 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు వివరించారు. మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు ఉందని వెల్లడించారు. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. మొత్తం పొడవు 725 మీటర్లు. ఈ అంజీఖడ్‌ తీగల రైల్వే వంతెన.. జమ్మూ-బారాముల్లా మార్గంలోని కాట్రా రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల మధ్య దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులనూ తట్టుకోగలదని అధికారులు చెబుతున్నారు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 12 May 2023 06:17PM

Photo Stories